కర్నూలు : జనసేన అధినేత పవన్కల్యాణ్ కర్నూలు జిల్లాలో నేడు, రేపు పర్యటించనున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన యువతి హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ర్యాలీ చేపట్టనున్నారు. రాజ్విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ చేశాక... అక్కడే బహిరంగ సభ నిర్వహించనున్నారు. జిల్లాలోని వివిధ సమస్యలపై రేపు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్టు జనసేన జిల్లా నేతలు తెలిపారు.