ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 20న ఏపీ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2020, 03:39 PM

ఏపీ ఎంసెట్‌-2020 షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 20న నోటిఫికేషన్‌ విడుదలతో ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఎంసెట్‌- 2020 కమిటీ చైర్మన్‌ రామలింగరాజు, ఎంసెట్‌-2020 కమిటీ కన్వీనర్‌ వి.రవీంద్ర షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు తెలిపారు.
దరఖాస్తులను ఫిబ్రవరి 26 నుంచి మార్చి 27 వరకు ఆన్ లైన్ లో స్వీకరిస్తారు.
రూ.500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం.
రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 9 వరకు దరఖాస్తుకు అవకాశం.
రూ. 5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 14 వరకు దరఖాస్తుకు అవకాశం.
రూ.10 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 16 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఎంసెట్‌-ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఏప్రిల్‌ 20, 21, 22, 23 తేదీల్లో జరగనుంది.
ఎంసెట్‌-అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్ష ఏప్రిల్‌ 23-24 తేదీల్లో జరగనుంది.ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ఈ రెండు స్ట్రీమ్‌లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22-23 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఎంసెట్‌ ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో జరుగుతుంది.
ఎంసెట్‌ రాయదలచుకున్న అభ్యర్థులు ఒక స్ట్రీమ్‌కు అయితే రూ.500, రెండు స్ట్రీమ్‌లకు అయితే రూ.1000 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ సారి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు కానుంది. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com