ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 30, 2017, 01:48 PM

 అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని భాజపా ఎంపీ సాక్షి మహరాజ్‌ అన్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి ఎవరైతే అడ్డు చెప్పారో ఇప్పుడు వారే రామ భక్తులుగా మారిపోయారని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ముస్లిం కమ్యూనిటీ సైతం అండగా నిలిచిందని ఆయన తెలిపారు. మంగళవారం బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణ నిమిత్తం లఖ్‌నవూ చేరుకున్న భాజపా అగ్రనేతలను కలిసేందుకు ఎంపీ సాక్షి మహరాజ్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రాబీ మసీదు కూల్చివేత కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు భాజపా నేతలు అద్వానీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, మురళీమనోహర్‌ జోషి లఖ్‌నవూ న్యాయస్థానానికి వచ్చిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com