శ్రీలంక వరద సహాయక చర్యల్లో ఇండియన్ నేవీ బిజీ అయ్యింది. ఇప్పటికే ఓ నౌక ద్వారా నిత్యవసర సరుకులను పంపిన నేవీ.. ఐఎన్ఎస్ శార్థుల్ ను కూడా రంగంలోకి దింపింది. భారత్ నుంచి ఆహారం, మంచినీళ్లు, నిత్యవసర సరుకులతో ఈ నౌక కొలంబో చేరింది. ఇండియన్ ఆర్మీ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల కారణంగా వంద మందికి పైగా మరణించినట్లు లంక ప్రభుత్వం ప్రకటించింది.