భారత్ తో హమిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ విజయలక్ష్యం 180 పరుగులు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న న్యూజిలాండ్ తొలుత భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో సిరీస్ లో నిలవాలంటే గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేయాలి.