విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో రాజీపడ్డామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహానాడులో ఆయన ప్రసంగిస్తున్నారు. ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ దానికి చట్టంలో పొందుపరచలేదని అన్నారు. దాంతో సమస్య వచ్చిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని అన్నారనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే దానిని అంగీకరించామని చంద్రబాబు అన్నారు. ఎంతటి సంక్షోభ పరిస్థితులు ఉన్నా ఇచ్చిన హాిమీలను నెరవేరుస్తూ…అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా వెనుకబడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడేళ్లుగా మన చేసిన కృషి అవార్డుల రూపంలో కనిపిస్తున్నదన్నారు.