ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాసనమండలి చైర్మన్ టీడీపీ కార్యకర్త :మంత్రి బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2020, 05:04 PM

శాసనమండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి బొత్స విమర్శించారు. నిబంధనలకు విరుద్దంగా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం ఏంటనీ ప్రశ్నించారు. శాసనమండలి రద్దు చేస్తే లోకేష్ పదవి పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో లోకేష్ ఇకపై గెలవలేడన్న భయం చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. తమకు టీడీపీ ఎమ్మెల్సీలను కొనాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులను కొనే అలవాటు చంద్రబాబుకు ఉందని.. అందుకు తెలంగాణలో జరిగిన ఓటుకు నోటే సాక్ష్యమన్నారు. శాసనమండలి రద్దుపై రేపటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని బొత్స స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com