ప్రధాని మోదీ మట్టి, నీళ్లు తెచ్చారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఇక్కడ అమరావతి భూమి పూజలో పాల్గొన్నారని టీడీపీ నేతలు అంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. మరి అదే మోదీ కూడా చంద్రబాబుపై గత ఎన్నికల్లో విమర్శలు గుప్పించారని రోజా గుర్తు చేశారు. చంద్రబాబును కేసీఆర్ పొగిడారని టీడీపీ నేతలు అంటున్నారని, తర్వాత కాలంలో చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్ లేడని కేసీఆర్ కూడా అన్నారని రోజా విమర్శించారు.