ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వార్ధ ప్రయోజనాలకోసమే రాజధాని మార్పు : జీవీఎల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2020, 12:30 PM

స్వార్ధ ప్రయోజనాలకోసమే రాజధాని మార్పు చెప్పారు అని జీవీఎల్ నరసింహ రావు అన్నారు.   అమరావతిని ఉత్తుత్తి రాజధానిని చేయాలని చూస్తున్నారు. రాజధానిపై  కేంద్రానికి చెప్పి చేశామన్నది దుష్ప్రచారం అని జీవీఎల్ అన్నారు. రాజధానిపై కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు అని అయన అన్నారు. తీసుకున్న నిర్ణయాన్ని జగన్ సమర్ధించుకోలేకపోతున్నారని అయన అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే ఎందుకు విచారణ చేయించడం లేదు ? అని అయన ప్రశ్నించారు. టీడీపీలోని అక్రమార్కులను వైసీపీ ఎందుకు కాపాడుతుంది?... , రెండు పార్టీలు విమర్శించుకుంటూనే... భూ వ్యాపారాలు చేస్తున్నారని అయన అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వమే భాద్యత వహించాలని అన్నారు.  జనసేనతో కలిసి త్వరలో ప్రజావ్యతిరేక  విధానాలపై పోరాటం చేస్తాం అని అన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com