ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతకల్లు డివిజన్‌ మీదుగా వెళ్లే పలు రైళ్ల దారి మళ్లింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2020, 08:05 AM

గుంతకల్లు: గుంతకల్లు-గుంటూరు రైల్వేలైన్‌లోని నల్లపాడు-సాతులూరు సెక్షన్‌లో జరుగుతున్న డబ్లింగ్‌ విద్యుదీకరణ పనుల కారణంగా గుంతకల్లు డివిజన్‌ మీదుగా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్‌ వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (నెం. 18464) రైలును ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకూ ధర్మవరం, గుంతకల్లు, గుంటూరు, క్రిష్ణా కెనాల్‌ రూటులో కాకుండా, జోలార్‌పట్టై, మేల్పాకం, రేణిగుంట, గూడూరు, క్రిష్ణా కెనాల్‌ స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలియజేశారు.


తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 4 వరకూ ఇదే రూటులో మళ్లించి పంపనున్నట్లు తెలియజేశారు. పూరి-యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22883) రైలును ఈ నెల 31, తిరుగు ప్రయాణపు రైలు (నెం. 22884)ను ఫిబ్రవరి 1న ఇదే రూటు మీదుగా మళ్లించనున్నామన్నారు. కన్యాకుమారి-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (16525) రైలును ఈ నెల 21వ తేదీన అల్‌పుజ్హ స్టేషన్‌ మీదుగా మళ్లించనున్నట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com