వాట్సాప్...ప్రస్తుతం ఎక్కువ మంది యూజర్లు వాడుతున్న సోషల్ మీడియా యాప్స్ లో ఇదొకటి...టెక్స్ట్ మెసేజెస్, వాయిస్ మెసేజెస్, వాయిస్ కాల్స్, వాట్సాప్ కాల్స్, స్టేటస్ షేరింగ్, లొకేషన్ షేరింగ్ ఇలా వివిధ ఫీచర్లతో అతితక్కువ కాలంలోనే కోట్లాదిమంది యూజర్స్ ని ఆకర్షించగలిగింది...ఇలాంటి యాప్ ను పాజిటివ్ గా వాడితే ఎంత మంచి ప్రయోజనాలు ఉంటాయో, నెగిటివ్ గా వాడితే అంతే దుష్పరిణామాలూ ఉంటాయి...
వాట్సాప్ ను ఎక్కువ మంది నెగిటివ్ గా వాడుతుండడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం....అశ్లీల వీడియోలు, అసభ్యకరమైన మెసేజ్ లు, క్రైమ్ కు ప్రేరేపించేలా సమాచారం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం, గ్రూప్ ల పేరుతో అనవసర రాద్ధాంతాలకు తెరతీయడం, కులమతాలను టార్గెట్ గా చేసుకొని మెసేజ్ లు చేయడం లాంటి విషసంస్కృతిని మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తూనే ఉన్నాం....దీనివలన వ్యక్తుల్లో నేరప్రవృత్తి ఎక్కువగా పెరుగుతుందని మేధావులు ఎప్పటినుండో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...వాట్సాప్ ను నిషేదించాలని ఒకానొక సమయంలో ప్రభుత్వం ఆలోచన చేసిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఈ సమాచారం సంఘవిద్రోహుల చేతుల్లోకి వెళ్తుందని దాన్ని ఆసరాగా చేసుకొని వారు మరింతగా రెచ్చిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు...ఇప్పటికైనా ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసి దీన్ని నెగిటివ్ గా వాడేవారికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు...యూజర్లకు కూడా పాజిటివ్ గా వాడాలని సలహా ఇస్తున్నారు.