ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎంలపై ఇసి చాలెంజ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:58 AM

-బహిరంగ పరీక్షకు సిద్ధమైన ఎన్నికల సంఘం


న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) పనితీరును నిరూపించేందుకు బహిరంగ పరీక్షకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఈవీఎంల పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శనివారం నమూనా ప్రదర్శన నిర్వహించింది. ట్యాంప రింగ్‌కు అవకాశం లేదని నిరూపించేందుకు సీఈసీ శనివారం ఢిల్లీలో ఈ ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా ఈవీఎంల వినియోగంతో పాటు, కాగితపు స్లిప్పులపై వివరాలు నమోదయ్యే పత్రాల గురించి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నసీం జైదీ మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు ఈవీఎంలతో ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసి నట్టు ఆయన గుర్తుచేశారు. ఈవీఎంల పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీలకు సందేహాలు వచ్చాయని, వాటి పనితీరుపై వచ్చిన ఫిర్యా దులను పరిశీలించినట్టు ఆయన తెలిపారు. సీఈసీ ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకు వెళుతున్నదన్నారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతపై ఆధారపడుతున్నట్టు వివరించారు. అత్యున్నత ప్రమాణాలు పాటించడమే తమ లక్ష్యమన్నారు. కొన్ని పార్టీలు ఓటు రసీదు యంత్రాలపై అభ్యంతరాలు వ్యక్తంచేశాయన్నారు. ఇకపై ఓటు రసీదు యంత్రాలతో కూడిన ఈవీఎంలను వినియోగించనున్నట్టు జైదీ స్పష్టంచేశారు. పారదర్శక ఎన్నికల నిర్వహణపై ఈసీకి ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందన్నారు. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేలా ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేస్తున్నారంటూ కొన్ని రాజకీయ పార్టీల గత కొంతకాలంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి చూపించాలని రాజకీ య పార్టీలకు ఎన్నికల కమిషన్‌ చేసిన బహిరంగ ఛాలెంజ్‌లో భాగంగా జూన్‌ 3 నుంచి అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల లోపాలు ఉంటే నిరూపించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి జైదీ ప్రకటించారు. రాష్ట్ర, జాతీయ పార్టీలకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను తమ వెంట తెచ్చుకోని ట్యాంపరింగ్‌ చేసి నిరూపించవచ్చు. ఈసీ సవాలుపై ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్లు మే 26 సాయంత్రం 5గంటలోపు తమ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం)లు ట్యాంపరింగ్‌ జరిగినట్లు సరైన ఆధారాలు లేవని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి నసీమ్‌ జైదీ తెలిపారు. ఎవరైతే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేశా రో ఆయా పార్టీలు ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఎటువంటి ఆధారాలు చూపిం చలేదని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలను తారుమారు చేయడం సాధ్య పడదు, అందులోని ఇంటర్నల్‌ సర్క్యూట్‌ను మార్చడం సులువు కాదు. ట్యాంప రింగ్‌ జరగకుండే విధంగా బలమైన సాంకేతిక ఫీచర్లు అందులో ఉన్నట్లు జైదీ వెల్లడించారు. ఈవీఎంలకు ఎటువంటి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండదు, వాటిని తారుమారు చేసే అవకాశమే లేదని జైదీ అన్నారు. పారదర్శకమైన ఎన్నిక ప్రక్రియ జరిగేందుకు అన్ని ఎన్నికల్లోను ఈవీఎంలతో పాటు, వీవీపీఏటీ యం త్రాలను కూడా ఉపయోగించనున్నారు. ఈవీఎంల పనితీరుపై ఎవెనా సంద ేహాలు ఉన్నా, ట్యాంపరింగ్‌పై సరైన ఆధారాలు ఉన్నా తమ వద్దకు రావొచ్చంటూ ఈసీ ఆహ్వానించింది. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి చూపాలంటూ అన్ని రాజ కీయ పార్టీలకు ఈసీ వేసిన సవాలును ఈనెల చివరిలో నిర్వహించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com