ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రిపుల్‌ తలాక్‌ మతాంశం కాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:53 AM

విజయవాడ, మేజర్‌న్యూస్‌ః ట్రిపుల్‌ తలాక్‌ మతా నికి సంబంధించిన అంశం కాదని కేంద్రమంత్రి కె.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ఆవాస అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు ఎంపికైన సందర్బంగా శనివారం విజయవాడలో మీట్‌ అండ్‌ గ్రీట్‌ జరిగింది. కార్యక్రమంలో పాల్గొ న్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ట్రిపుల్‌ తలాక్‌ మతానికి సంబంధించిన అంశం కాదని, మహిళల గౌరవానికి సంబంధించిన విషయం అని వెంకయ్య అన్నారు. అలాగే హిందూ సంప్రదాయ చట్టాల్లోనూ మార్పులు తెచ్చారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వైఎస్‌ జగన్‌ కలవడంలో తప్పు లేదని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రతిపక్ష నేత వచ్చి ప్రధానిని కలిస్తే తర్జన భర్జనలు ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ పరిపక్వత లేనివారే మోదీతో వైఎస్‌ జగన్‌ భేటీని విమర్శిస్తు న్నారన్నారు. కొందరు ఈ విషయంలో ఎందుకు అతిగా స్పందిస్తున్నారో తెలియదని ఆయన అన్నా రు. వచ్చే ఎన్నికలలో పొత్తుల గురించి ఇప్పుడే చెప్పలేమని, ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని వెంకయ్య పేర్కొన్నారు. విజయవాడలో అమిత్‌ షా పర్యటనను విజయవంతం చేస్తామని వెంకయ్య తెలిపారు. దక్షిణాదిలో పార్టీని మరిం తగా ప్రజల్లోకి తీసుకు వెళతామని, క్షేత్రస్థాయిలో తమ బలాన్ని పెంచుకుంటామని అన్నారు.


 వెద్యశిబిరాన్ని ప్రారంభించిన వెంకయ్య  విజయవాడలోని ఆత్కూరులో స్వర్ణభారతీ ట్రస్ట్‌ వెద్యశిబిరం ప్రారంభమైంది. నేడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com