కాంగ్రెస్, జెఎంఎం, ఆర్జెడి మిత్ర పక్షాల కూటమి తరఫున రాజ్మహల్, మహాగమ ల్లో రెండు ఎన్నికల ప్రచార సభల్లోకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ప్రసంగించారు. జెఎంఎం అభ్యర్థి కేటుబ్బుదిన్ షేక్కు మద్దతుగా రాజ్మహల్లో జరిగిన ప్రచార సభలో రాహుల్ మాట్లాడుతూ.... విపక్ష కూటమి అధికారం లోకి వస్తే మొదటి ప్రాధాన్యం వ్యవసాయ రుణాలను రూ.2 లక్షల వరకు మాఫీ చేయడమేనని, క్వింటాలు ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2500 వరకు రైతులు పొందగలుగుతారని చెప్పారు. బిజెపి ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం పై తీవ్రంగా విమర్శిస్తూ దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. నిరుద్యోగం 45 ఏళ్ల స్థాయికి పెరిగిందని, నోట్ల రద్దు వల్ల పేదలు దెబ్బతిన్నారని, ఇప్పటికీ ప్రజలు ఆ దెబ్బ నుంచి కోలుకోలేక పోతున్నారని విమర్శించారు. తాము అధికారం లోకి వస్తే గిరిజనుల నిరుపేదల భూములు, అడవులు, నీళ్లు రక్షిస్తామని చెప్పారు. గొడ్డా నియోజక వర్గంలో ర్యాలీలో మాట్లాడుతూ వి జార్ఖండ్ ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జార్ఖండ్ లోని గొడ్డా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దీపికా పాండే పోటీ చేస్తున్నారు.