కేంద్ర ప్రభుత్వం ప్రముఖ స్వచ్ఛ స్థలాల జాబితాలో మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయాన్ని చేర్చింది. స్వచ్ఛజాబితా మూడో దశలో మంత్రాలయం ఆలయాన్ని ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి రతన్లాల్ కటారియా తెలిపారు. లోక్సభలో సభ్యుడి ప్రశ్నకు ఈమేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మూడో దశలో 10 స్వచ్ఛ స్థలాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.'' మంత్రాలయంలో 100శాతం ఓడీఎఫ్ సాధనకు మరుగుదొడ్లు నిర్మిస్తాం. మంత్రాలయం స్వచ్ఛతకు అన్ని చర్యలు తీసకుంటాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో భక్తుల భద్రతపై మరింత నిఘా ఏర్పాటు చేస్తాం. ఐదువేల మొక్కలు నాటి రెండు ఉద్యానవనాలు తీర్చిదిద్దుతాం. కొత్త ఆసుపత్రి భవనం, స్నానఘట్టాల నిర్మాణం చేపడతాం'' అని కేంద్రమంత్రి వివరించారు.