ప్రియాంక రెడ్డి హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో బాగంగానే పలువురు నేతలు, సినీ ప్రముఖులు తమ స్పందనను తెలియజేస్తున్నారు. తాజాగా ప్రియాంక రెడ్డిను చంపిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన అంశంపై కర్నాటక సిఎం యడ్యూరప్ప స్పందించారు. ఎన్కౌంటర్ను సమర్థిస్తూ.. తెలంగాణ పోలీసులను సిఎం యడ్డీ మెచ్చుకున్నారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపినట్లు ఆయన చెప్పారు. క్రైం జరిగిన ప్రదేశం నుంచి నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేశారని, ఆ సమయంలో పోలీసులు అనివార్యంగా కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు.