ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 05, 2019, 07:37 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈరోజు, రేపు జగన్ ఢిల్లీలోనే అవకాశముంది. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ లభించడంతో జగన్ హడావిడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొన్న జగన్ వెనువెంటనే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు జగన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com