అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : నరేగా పనులు మంద కొడిగా సాగుతున్నాయని, ఉద్యమస్ఫూర్తితో పనులు చేపట్టాలని పిలు పునిచ్చినా వేగం పుంజుకోవడంలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నీరు-ప్రగతి పురోగతిపై ఆయన, సీ ఎస్ దినేష్కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాలు 14.5 మీటర్ల దిగువన ఉన్నా యని, నీరు-ప్రగతి ద్వారా వాటి ని 6.5మీటర్ల ఎగువకు తీసుకురావాల్సి ఉందన్నారు. రుతుపవనాల రాకకు ముందు 8 మీటర్లు, తరువాత 3 మీ టర్ల దిగువన భూగర్భ జలాలు ఉండాలనేది మన లక్ష్యమని అధికారులతో ఆయన స్పష్టం చేశారు. 10 లక్షల పంటకుంటల తవ్వకం, 20వేల చెక్ డ్యాంల నిర్మాణం పూర్తికావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో బాధ్యతాయుత పరిపాలన అందించాలన్నారు. ప్రతి అధికారి పనితీరును బేరీజువేస్తానని చంద్ర బాబు తెలిపారు. పంటకుంటల తవ్వకంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పక్కాఇళ్ల నిర్మాణం పనులు మరింత వేగం పుంజుకోవాలని ఆయన అన్నారు.