వెలగపూడి, సూర్య ప్రధాన ప్రతినిధి : సౌర, పవన విద్యుత్, నీటి శుద్ధి, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ, స్మార్ట్ సిటీ నిర్వహణ వంటి 15 రంగా లలో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా ఆసక్తి కనబ రచింది. దీనిపై ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళదామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కెనడా కౌన్సిల్ జనరల్ జెన్నిఫర్ డె బిన్నీకి సూచిం చారు. ఆయా రంగాలలో ప్రఖ్యాతిగాంచిన 15 కెనడా దేశపు సంస్థల ప్రతినిధులతో కలిసి జెన్నిఫర్ సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్య మంత్రితో సమావేశమయ్యారు. విద్యుత్ రంగంలో ఏపీ మలి విడత సంస్కరణలకు సిద్ధమ వుతున్న ఈ తరుణంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టు బడులు పెట్టేందుకు కెనడా కంపె నీలు ముందుకు రావడం శుభ సూచకమని ముఖ్యమంత్రి అన్నారు. పెద్ద సంస్థలు సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి వస్తే ఉత్పాదక వ్యయం గణనీయంగా తగ్గి వినియో గదారుడు లాభపడ తాడ న్నారు. సౌర విద్యుత్ రం గంలో అత్యంత కీలకమైన నిల్వ వ్యవస్థను నెలకొ ల్పేందుకు కృషి చేస్తు న్నామని, ఇటీవలే అవి ఒక కొలిక్కి వచ్చాయని తెలిపారు. భారత్లో, ముఖ్య ంగా ఆంధ్రప్రదేశ్లో సౌర శక్తికి కొదవ లేదని, సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్న తమ రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడం సముచితంగా వుంటు ందని కెనడా సంస్థలకు వివరించారు. కర్నూలులో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును నిర్మించ డమే కాకుండా వచ్చే రెండేళ్లలో 4,600 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నామని వివరించారు. తరువాత స్మార్ట్ గ్రిడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అత్యంత చౌకగా విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచే స్తున్నదని చెప్పారు. ప్రస్తుతం సౌర విద్యుత్ యూని ట్కు రూ.2.41లకు లభిస్తోందని, అదే జల విద్యు త్ అయితే యూనిట్కు రూ.5కు పైగా ఖర్చవు తోందని ప్రస్తావించారు. ఇప్పటికే అనేక దేశాలు అమరావతికి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని అంటూ, కెనడా ప్రభుత్వం వివిధ రంగాలలో నిష్ణాతులందరినీ ఒకచోట చేర్చేలా అమరావతిలో ఆ ప్రభుత్వం తరపున ఒక టౌన్షిప్ నిర్మాణం చేప ట్టాలని కౌన్సిల్ జనరల్కు సూచించారు.