ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మునిసిపల్‌ కాంట్రాక్టు కార్మికుల జీవనోపాధిని దెబ్బ తీసే జీఓలు రద్దు చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:24 AM

 నరసాపురం, మేజర్‌న్యూస్‌ : మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే జి.ఓలు 279, 160 లను రద్దు చేయ్యాలని కోరుతూ ఏ.ఐ.టి.యు.సి, సి.ఐ.టి.యు ల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు ధర్నా చేసారు.సోమవారం స్ధానిక అంబేద్కర్‌ సెంటర్‌లో నిర్వహించిన ధర్నాలో నాయకులు ఆరేటి ముత్యంజయరావు, ముచర్ల త్రిమూర్తులు, నెక్కంటి క్రాంతి కుమార్‌, తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 130 కి పైగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీలో దాదాపు 50 వేల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరు నెలకు రు.1000, 1200 జీతాలతో పని చేస్త్తూ ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. చాల కాలం చేసిన పోరాటం ఫలితముగా నెలకు 10 వేలు నగర పంచాయతీలలో, 11 వేలు మున్సిపల్‌, కార్పోరేషన్లలో పొందుతున్నారన్నారు. అయితే గత ఎన్ని లలో వీరిని పర్మినెంటు ఉద్యోగులుగా చేస్తామన్న టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించిందని పైగా వీరి జీవనోపాధిని దెబ్బ తీసే జి.ఓలు 279, 160 లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.ఈ రెండు జీ.ఓలు అమలైతే కాంట్రాక్టు కార్మికలు జీవితాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్వక్తం చేసారు.


   ఈ జి.ఓ లను వెంటనే రద్దు చేయ్యాలని ప్రభుత్వాని డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కాంట్రాక్టు సిబ్బంది, నాయకులు పొన్నాడ రాము, పొగాకు నారాయణరావు, కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com