రాజధాని, సమగ్రాభివృద్ధిపై జీఎన్రావు కమిటీ అభిప్రాయాలను సేకరిస్తోంది. జీఎన్రావు కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలు స్వీకరిస్తోంది. అభిప్రాయాల స్వీకరణ రేపటితో ముగియనుంది. జీఎన్రావు కమిటీని రాజధాని ప్రాంత రైతులు కలిశారు. రాజధాని ప్రాంతంలో కొన్ని నెలలుగా ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని రైతులు కమిటీ దృష్టికి తెచ్చారు. రిటర్నబుల్ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇస్తామన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలయ్యేలా చూడాలని రాజధాని రైతులు కమిటీ సభ్యులను కోరారు. 9, 14 ఫారంపై రాజధాని రైతులను జీఎన్రావు కమిటీ ప్రశ్నించింది. రాజధానిలో ఎలాంటి మార్పు ఉండదనే స్పష్టత వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా కమిటీ కసరత్తు చేస్తోంది. జీఎన్రావు కమిటీ నివేదికతో రాజధాని విషయంంలలో అస్పష్టత తొలగనుంది.