విజయవాడ, సూర్య బ్యూరో : బలహీనవర్గాలకు నష్టం లేకుండా ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా, ఉద్యోగాలపరంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వ డం వల్ల ఎవరికి నష్టం లేకుండా చేస్తే ఇబ్బంది లేదని రవాణా, బి.సీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళి శాఖల మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత ఎన్నికలలో కొన్ని హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చార న్నారు. మేము ఆధికారంల్లోకి వస్తే వెయ్యి కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, బి.సీ.లకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పామన్నారు. మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వెయ్యి కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా, 40 శాతం లోన్లు ఇచ్చామన్నారు. వెయ్యి కోట్లకు 340 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కాపులను బి.సీలలో చేర్చడానికి మంజూనాధన్ ఆధ్వర్యంలో ఒక కమీటిని కూడా వేశామన్నారు. ఆ కమీటికి పల్స్ సర్వే డేటా కూడా ఇవ్వడం జరిగిందని, రిపోర్టు చివరి దశకు చెరిందన్నారు. బి.సీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామంటే ఇబ్బంది లేదని, ఒక బి.సీ మంత్రిగా ప్రజలందరికి విజ్ణప్తి చేస్తున్నానని చెప్పారు. బి.సీలకు అన్యా యం జరిగితే ముఖ్యమంత్రితో నేనే ముందుగా మాట్లాడతానని, ముఖ్య మంత్రి కి కూడా బి.సీలంటే ఒక ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కొద్దిమంది నాయ కులు పక్కదోవ పట్టించడానికి ఏవెవో మాట్లాడుతూ ఉంటారని, ఆ మాటలు వినకూడదని చెప్పారు. బి.సీల మంత్రిగా బి.సీ.లకు చెబుతున్నాను, మనకు నష్టం కలగకుండా చూస్తామని, కాపులు అడిగేది ఉద్యోగాలలో రిజర్వే షన్లు తప్ప, రాజకీయంగా రిజర్వేషన్లు అడగటం లేదని చెప్పారు. కాపు కార్పొ రేషన్ మొదటి సంవత్సరం లోన్లు ఇవ్వడంలో కొద్ది ఇబ్బందులు ఏర్పడినా, రెండో ఏడాది సరిచేయడం జరిగిందన్నారు. వాటిని సరిచేసుకుని ఈ ఏడాది ముందు కు వెళ్లతామని చెప్పారు. ఈమధ్య కాలంలో కాపు కార్పొరేషన్ చైర్మన ్కు, ఎం.డీకి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడాయనే వార్తలు పత్రికలలో వచ్చా యని, అది కరెక్ట్ కాదని, అలాంటివి ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకుని ముం దుకు వెళ్లతామన్నారు. ఈ రోజు బోర్డు మీటింగ్ కూడా అందుకోసం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో కాపు కార్పొరేషన్ ద్వారా వినూత్నమైన పధకాలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ సమా వేశంలో కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, కాపు కార్పొరేషన్ ఎం.డీ అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు.