ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంగోలులో మంత్రులు విస్తృత తనిఖీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2017, 04:40 AM

  ఒంగోలు, మేజర్‌న్యూస్‌ : ఎరువుల తూకాల్లో తేడాలు రాకుండా రైతులకు నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒంగోలు నగరం చేరుకుని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శిద్ధా రాఘవరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వంగా కలుసుకున్నారు. అనంతరం ఇరువురు మంత్రలు సంయుక్తంగా నగరంలోని గ్యాస్‌ గోదాములు, ఎరువులు గోదాములను ఆకస్మి కంగా తనిఖీలు చేశారు. తొలుత మంత్రులు మంగమూరు రోడ్డులోని శ్రీదేవి ఇండియన్‌ గ్యాస్‌ గోదాములను సందర్శించారు. అక్కడ వారి గ్యాస్‌ సిలిండర్లను స్వయంగా ఎత్తి పరిశీలించారు. ఇంటికి వచ్చే వంట గ్యాస్‌ సిలిండరును, వ్యాపా రాలకిచ్చే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లను వేరువేరుగా తూకం వేసి బరువును గమనించారు. రెండు రకాల సిలిండర్లు తూకాలు సరిగా ఉన్నట్లు మంత్రులు సంతృప్తి వ్యక్త పరిచారు. ఇంటికిచ్చే సిలిండరు బరువు 30 కిలోలు, కమర్షి యల్‌ బరువు 38 కిలోలున్నాయి. అలాగే తూకంరాళ్ళను కూడా బరువు తూచగా అవి కూడా 30 కిలోలు ఉన్నాయి. వినియోగదారులకు ఏలాంటి నష్టం జరగకుండా సజావుగా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అది ఆచరణలో ఎంత మేరకు అమలుతుందో తెలసుకోవడానికి తనిఖీలు చేస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. 


   అనంతరం ఇరువురు మంత్రులు త్రోవగుంటలోని వ్యవసాయ ఎరువులు గోదామును కూడా ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడున్న యూరియా ఎరువులను మంత్రులు పరిశీలించారు. తొలుత 50.130 కిలోలు ఉండాలిసన విజయ్‌ ఎరువులు ఒక మూటను తూకం వేయగా 49.695 కిలోలు, మరొక మూటను తూకం వేయగా 49.560 కిలోలు ఉండటం గమనించారు. దీంతో మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ తూకాల్లో దాదాపు 330 గ్రాములు నుంచి 500 గ్రాముల వరకు తక్కువ ఉంటుందని, దీనివలన దాదాపు 25 రూపా యలు వరకు రైతులు నష్టపోతున్నారని, ఇకపై ఇటువంటి తేడారాకుండా ఖచ్చి తమైన తూకాలు ఉండాలని, రైతులు నష్టపోకుంఆడ చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.


     ఈ తనిఖీల్లో మంత్రుల వెంట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ బి రాజశేఖర్‌, జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎం హరిజవహర్‌లాల్‌, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజన్‌ అధికారి కమ్మ శ్రీనివాస రావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీ కృష్ణ, పౌరసరఫరాల సంస్ధ డైరేక్టర్‌ మన్నెం రవీంద్ర, లీగల్‌ మెట్రాలజీ సహాయ కంట్రోలర్‌ ఆర్‌ ప్రభుకుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com