పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలకు కార్యకర్తలే బుద్ధి చెప్పిన ఘటన రాజస్థాన్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే బహుజన్ సమాజ్వాది పార్టీ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ రామ్ జీ గౌతమ్, రాష్ట్ర మాజీ ఇన్ ఛార్జీ సీతారామ్ లపై ఆ పార్టీ కార్యకర్తలే జైపూర్లోని కార్యాలయంపై దాడి చేయటమే కాకుండాపార్టీ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారని, వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని నిలువరించేందుకు బైటకు వచ్చిన రామ్ జీ, సీతారామ్ లను లాగి ,వారిద్దరి మెడకు చెప్పుల దండ వేసి, ముఖానికి నలుపు రంగు పూసి గాడిదలపై ఎక్కించారు. అంతేనే వీధుల వెంబడి వీరిద్దరిని గాడిదలపై ఊరేగించారు. పార్టీకి నష్టం కలిగించే నేతలు ఎంతటివారైనా ఇలాంటి చర్యలే ఇకపై ఉంటాయని కార్యకర్తలు ఈ సందర్భంగా హెచ్చరించడం గమనార్హం.