అనంతపురం జిల్లా తాడిపత్రి రిపబ్లిక్ ను దశాబ్దాలుగాపాలించిన జెసి బ్రదర్స్ (దివాకర్ ట్రావెల్స్)కు చెందిన బస్సులు నిబంధలను ఉల్లంఘించిందున 31స్టేజ్ క్యారియజ్, 18 కాంట్రాక్టు క్యారియజ్ బస్సులపై కేసులు నమోదు చేయటంతో పాటు వాటి పర్మిట్ రద్దు చేశామని రవాణ శాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సదరు శాఖాధికారులు ఓ ప్రకటన విడుదల చేస్తూ దివాకర్ ట్రావెల్స్ యజమానులు మోటార్ వాహనాల చట్టాలు మరియు అన్ని రకాల నిబంధలను ఉల్లంఘించారని, బస్సులను తిప్పుతూ రహదారి భద్రత నిబంధలను అతిక్రమించి, ప్రభుత్వాన్ని , ప్రయాణికులను మోసం చేశారని వారు పేర్కొన్నారు.
రూల్స్ కు విరుద్దంగా తిరుగుతున్న 31స్టేజ్ క్యారియజ్ బస్సులను, 18కాంట్రాక్టు క్యారేజీ బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాటు 10 స్టేజ్ క్యారేజ్ బస్సులను సీజ్ చేశామని చెప్పారు. అన్ని బస్సుల పర్మిట్లను సస్పెండ్ చేయడం జరిగిందని వివరించారు.
ఈ బస్సుల ప్రయాణీకులకు అందిస్తున్న ఇన్సురెన్సులు నకిలీవంటూ వచ్చిన ఫిర్యాదులపైన కూడా లోతుగా దర్యాప్తు జరుగుతున్నదని వారు చెప్పారు. సాధారణంగా రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న దివాకర్ బ్రదర్స్ ఏపి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ఎలాంటి తిరుగుబాటురాకపోవడం ఇదే ప్రథమమన్న వాదనలు ఇప్పడు వినిపిస్తున్నాయి.