ఎమ్మిగనూరు.. మంత్రాలయం టిడిపి ఇన్చార్జీ పి.తిక్కారెడ్డి ని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఎమ్మిగనూరు లోని తిక్కారెడ్డి నివాసానికి హైదరాబాద్ పోలీసులు వచ్చి గంట పాటు తిక్కారెడ్డి తో మాట్లాడి ఆయనను తీసుకెళ్లారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు స్థానిక పోలీసుల సాయంతో వచ్చి తీసుకెల్లారు. హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ వద్ద తిక్కారెడ్డి భాగస్వామిగా ఏర్పాటు చేసిన మద్యం పరిశ్రమ కు తీసుకున్న వరి పొట్టు కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వలేదని వారిపై ఓ వ్యక్తి పోలీసుల కు పిర్యాదు చేసినట్లు తెలిసింది. లక్ష టన్నుల వరి పొట్టు కు 12 కోట్లు బాకీ ఉన్నట్లు సమాచారం. యి కేసులో తిక్కారెడ్డి ని 3వ ముద్దాయి గా చేర్చినట్లు తెలుస్తుంది. తిక్కారెడ్డి ని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం మంత్రాలయం ఎమ్మిగనూరు నియొజవర్గాలలో వ్యాప్తి చెందడంతో ప్రజలు పలు రకాలుగా చర్చించుకోవడం జరిగింది. ఏపీ లో అధికార మార్పిడి జరగడంతో టిడిపి నాయకులపై కేసులు పర్వం సాగుతుందని చర్చికున్నారు.ఈ విషయంపై ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీధర్ వివరణ కోరగా సైబారాబాధ్ పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారో తెలియదని తెలిపారు..