తను టిడిపిని వీడి వైసిపిలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నానని, పార్టీ మారుతున్నట్టు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్. ఆదివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ ఇలాంటి ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు.
, టీడీపీలో తన ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని లను ఎన్నటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని, వీడిపోనని, టీడీపీ కార్యకర్తలకు స్పష్టం చేసారు. తన తండ్రి దేవినేని నెహ్రూ ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నానని, ఇందుకు పార్టీ పెద్దల అండదండలూ తనకున్నాయని చెప్పారు. ,
గత ఎన్నికల్లో దేవినేని అవినాష్ గుడివాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి కొడాలి నానిపై ఓటమిపాలయిన తదుపరి పార్టీ మారుతున్నట్టు కథనాలు వచ్చినా... తగుతీరుగా దేవినేని వివరణలు ఇవ్వకపోవటంతో అవి హెచ్చుమీరిన విషయం విదితమే.