బెంగుళూరు : ఐపీఎల్లో పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ హడలెత్తించాడు. బెంగుళూర్తో జరిగిన మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టాడు. 138 లక్ష్యంతో దిగిన ఆర్సీబీకి సందీప్ శర్మ తన అద్భుత స్వింగ్ బౌలింగ్తో షాకిచ్చాడు. చిన్నస్వామి స్టేడియంలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలీర్స్లను సందీప్ ఔట్ చేశాడు. సందీప్ ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్ల వేసి 22 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ 19 రన్స్ తేడాతో గెలిచింది. సందీప్ తీసిన వికెట్ల వీడియోలు ఇవే.