గోదావరి నదిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటు వెలికితీత పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ధర్మాడీ సత్యం బృందం గత వారం రోజులుగా మరోసారి వెలికితీత పనులు చేపట్టారు. కాగా ఈరోజు ఆక్సిజన్ మాస్కులను ధరించి నది లోపలకి వెళ్లిన గజఈతగాళ్ళు బోటును గుర్తించి పరిస్థితిని అధికారులకు వివరించారు. త్వరలో గజఈతగాళ్లతో లంగర్లును బోటు ముందుభాగంలో తగిలించే యోచనలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.