తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుమల కొండపైకి వెళ్లే 2 వ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు, సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మట్టిపెళ్లలు రోడ్డుపై కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో.. ప్రమాదం తప్పిందని అధికారులు అన్నారు. రెండు రోజుల క్రితం హరిణీప్ వద్ద పెద్ద బండరాయి కూలింది.