ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2019, 11:27 AM

మర్రిపాడు మండల పరిధిలోని బాట సింగనపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 30 ఎర్రచందనం దుంగలను ఆత్మకూరు అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఆత్మకూరు అటవీ శాఖ రేంజర్ హరి ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో తనిఖీ చేయగా అక్రమంగా తరలించేందుకు మూడు చోట్ల 30ఎర్రచందనం దుంగలను సిద్ధం చేసి ఉన్నారు. వాటిని పట్టుకుని ఆత్మకూరు రేంజ్ కార్యాలయానికి తరలించారు. వీటి విలువ సుమారు 3 లక్షల ఉంటుందని అంచనా వేశారు. ఈ తనిఖీల్లో మర్రిపాడు, కదిరినాయుడుపల్లి, కృష్ణాపురం , డీఆర్వోలు బేస్ క్యాంప్ సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com