గుంటూరు జిల్లా, నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారుల పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ కి వచ్చిన రోగులు దగ్గర నుంచి డబ్బుల వాసులు, హాస్పటల్ సిబ్బంది రోగులకు ఇవ్వాల్సిన మెడిసిన్ ఇవ్వకుండా బయట మెడికల్ షాప్ కి పంపించడం, బర్త్, డెత్ సర్టిఫికేట్ రూ.500 వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమే అని ఎమ్మెల్యే గోపి రెడ్డి ఆధారాలతో సహా నిరూపించడం గమనార్హం.