అమరావతి : నిరుద్యోగుల పై అంత కక్ష ఎందుకు జగన్ గారు.ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే వాళ్ళ మీద కేసులు పెడతారా? సిగ్గుగా లేదా? గ్రామ వాలంటీర్ పేరుతో మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. సచివాలయ పరీక్షా పత్రాలు లీక్ చేసి 20 లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచారు. పాదయాత్రలో కోటి 70 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి యువతను ఉద్ధరించేస్తానన్న మీరు, ఇప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారా?
ఉద్యోగాల కోసం అనంతపురంలో ధర్నా చేసిన 22 మంది నిరుద్యోగుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తేయ్యాలి. ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్