ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 11:29 AM

పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు భాగంగా గుడివాడ ఒన్ టౌన్ పోలీస్ స్టేషను లో    రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి  వెంకటేశ్వరరావు (నాని) , జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్  బాబు పోలీస్   అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకున్నా...ఈ దేశాన్ని రక్షించేది సైన్యం మనకు ఉన్నటువంటి అత్యున్నత  వ్యవస్థ పోలీస్ వ్యవస్థ.పోలీస్ అంటే ప్రజలకు భయముంటుంది అదేవిధంగా మనకు ఎదైన అవసరమయినప్పుడు మొట్టమొదటి గుర్తుకు వచ్చేది పోలీస్.ఈ సమాజంలో సంఘం లో ప్రజలను రక్షించేటువంటి వ్యవస్థ అటువంటి పోలీసు విది నిర్వహణ వారి ప్రాణాలు సైతం పోగోట్డుకునే వ్యవస్థ , పోలీస్ మిలటరీ.వీది నిర్వహణ లో అమరులైన పోలీసులు ను ప్రతి సంవత్సరం అక్టోబర్ లో వారం రోజుల పాటు వారి స్మరించుకుంటున్నాం.పోలీస్ అమరవీరుల త్యాగాలు ను స్మరించుకుంటూ వివిధ కారణాలు తో రక్తం కావలసిన ప్రజానీకానికి వారి రక్తదానం కార్యక్రమం ఇవ్వడం పోలీసులు ను అభినందిస్తున్న.ఇటువంటి కార్యక్రమం లో నేను కూడా భాగస్వామి గా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర లో పోలీస్ సమస్యలు ను కూడా తెలుసుకున్నారు...


 


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులు కూడా వారాంతపు సెలవు ఉండాలని దానిని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.ఈ ప్రభుత్వం పోలీస్ సంక్షేమానికి కట్టుబడి ఉంది వారం లో ఒక రోజు పోలీస్ సమస్యలు ను ఉన్నతస్థాయి అధికారులు చెప్పుకునే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.దేశంలో ఎవరు చెయ్యని విధంగా నాడు ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో  దీవంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక  మహిళను హోం మంత్రి గా పెడితే ,నేడు ఆయన   తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో  కూడా మహిళ ను హోం మంత్రి ని చేసారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com