తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. బోటును వెలికితీసేందుకు నది లోపలికి పంపిన లంగర్లకు బలమైన వస్తువు తగిలింది. ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం ఈ వస్తువును బయటకు లాగుతోంది. ఆ వస్తువు మునిగిపోయిన బోటు అని భావిస్తున్నారు. మునిగిపోయిన బోటును సాయంత్రంలోగా బయటకు తీస్తామని బృందంలోని సభ్యులు చెబుతున్నారు.