ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో సోమవారం రాత్రి వేగంగా వస్తున్న కారు వంతెన వద్ద బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించిన ఘటన చోటుచేసుకుంది. తెహ్రీ గర్హ్వాల్ జిల్లాలోని నైన్ బాగ్ వంతెన వద్ద వేగంగా వస్తున్న కారు బోల్తా పడింది. ఈ కారు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఉత్తరాఖండ్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, ప్రమాదానికి గురైన కారు శకలాలను తొలగించారు.