హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా జిల్లాలో సోమవారం అర్దరాత్రి దాటాక భూకంపం సంభవించింది. సిమ్లా జిల్లాలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0 గా భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ భూప్రకంపనలతో ఇళ్లలో ఉన్న జనం బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో సిమ్లా ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల సిమ్లా జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని హిమాచల్ ప్రదేశ్ అధికారులు చెప్పారు.