2019 ఆర్ధికశాస్త్రంలో నోబెల్ పురస్కారం భారత సంతతికి చెందిన అమెరికా ఎకానమిస్ట్ అభిజీత్ వినాయక్ బెనర్జీని వరించింది. అభిజీత్తో పాటు ఈ పురస్కారం అతని భార్య ఎస్తేర్ డఫ్లో మరియు మైఖేల్ క్రెమర్లకు దక్కింది. ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు పరిశోధనలు చేసినందుకుగాను వీరి కృషిని గుర్తిస్తూ జ్యూరీ ఈ త్రయంను నోబెల్ బహుమతితో గౌరవించింది. ఇక ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు అందజేయడం ప్రారంభించి 50 ఏళ్లు అయ్యింది. ఇలా ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న మహిళల్లో ఎస్తేర్ రెండో మహిళగా చరిత్ర సృష్టించింది