ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త !

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 07:54 PM

ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతుభరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. పెట్టుబడి సాయం రూ.13,500 లకు పెంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో రైతులకు కొంతవరకు ఊరట లభించనుంది. ఈ ప‌థ‌కాన్ని వైయ‌స్సార్ రైతుభరోసా పిఎం కిసాన్ యోజ‌న పేరుతో అమ‌లు చేయ‌నున్నారు. అయితే రైతుల‌కు అందించే ఈ పెట్టుబ‌డిని మూడు విడ‌త‌లుగా చెల్లిస్తారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు వివ‌రించారు. విడ‌త‌ల వారీగా రైతు భ‌రోసా ఇవ్వాల‌ని రైతులు కోరార‌ని, రైతుభరోసా ప‌థ‌కాన్ని నాలుగేళ్ల‌కు బ‌దులుగా ఐదేళ్లు పాటు అమ‌లుచేస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కం  ద్వారా ల‌క్ష‌ల మంది రైతుల‌కు నేరుగా పెట్టుబ‌డి అందుతుంద‌ని తెలియ‌చేశారు. రైతుల‌కు మే నెల‌లో 7500, ఖ‌రీఫ్ పంట‌ల కోత‌ల స‌మ‌యంలో , ర‌బీ అవ‌స‌రాల నిమిత్తం మ‌రో 4,000 చెల్లిస్తామ‌ని చెప్పారు. సంక్రాంతి వేళ చివ‌రి విడ‌త‌గా రూ.2,000 అందిస్తామ‌ని మంత్రి క‌న్న‌బాబు వివ‌రించారు. ప్ర‌స్తుతం 40 ల‌క్ష‌ల మందికి రైతుభరోసా అందిస్తున్నామ‌ని, ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే గ‌డువు ను మ‌రింత పెంచుతున్నామ‌ని చెప్పారు. న‌వంబ‌రు 15 వ‌ర‌కు రైతుభరోసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com