బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు జడ్ కేటగిరి భద్రత కల్పించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంగా త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయట. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నడ్డాకు ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందన్న భావనతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జడ్ కేటగిరీలో భాగంగా ఆయనకు షిఫ్టుల ప్రకారం ప్రతిక్షణం కనీసం 8 మంది సీఆర్పీఎఫ్ కమాండోలు.. మొత్తం 35 మంది కమాండోలు రక్షణగా ఉంటారు.