పుణె వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్లో పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. 108 బంతుల్లో పుజారా 52 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్ 50.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (81), పుజారా (54) క్రీజులో ఉన్నారు.