విజయవాడ: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దర్శించుకున్నారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ… అమ్మవారి దయతో కృష్ణానది పరవళ్లు తొక్కుతోందన్నారు. కనకదుర్గమ్మ దర్శనం భక్తుల జీవితంలో మార్పు తెస్తుందన్నారు. భక్తులు దేవస్థాన సిబ్బందితో సహకరించాలని కోరుతున్నానన్నారు. అమ్మవారి కరుణతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నారు.