సోమవారం బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఉదయం 6 గంటల సమయానికి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (రూ.300) దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలను ఈ నెల 14 వరకు రద్దు చేసారు. నిన్న అక్టోబర్ 6 న 85,130 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు రూ.2.93 కోట్లు