డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకునే వారికి ఆర్బీఐ స్వీట్ న్యూస్ చెప్పింది. ఇప్పటి నుంచి 24గంటల పాటు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని శుక్రవారం ఆర్బీఐ వెల్లడించింది. ఇంతకుముందు 7.45 గంటలు మాత్రమే నెఫ్ట్ సేవలు ఉండేవి. ప్రజలకు డబ్బు ట్రాన్స్ ఫర్ విషయంలో ఇబ్బందులు లేకుండా, ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్లను అర్థం చేసుకున్న ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ చెప్పిన ఈ నిర్ణయంతో మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే వాళ్లు సులభతరంగా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ పేర్కొంది.