తిరుపతి జూపార్క్ లో 5 తెల్ల పులి పిల్లలు జన్మించాయి. శ్రీవెంకటేశ్వర జూపార్క్ లో సమీర్, రాణి అనే రెండు పులులు 5 తెల్ల పులి పిల్లలకు జన్మనిచ్చాయి. ఈ ఐదింటిలో మూడు మగ పిల్లలు కాగా, రెండు ఆడ పిల్లలు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జూపార్క్ ను సందర్శించి పులి పిల్లలకు నామకరణం చేశారు. మగ పులి పిల్లలకు సిద్దాన్, వాసు, జగన్ అని, ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గ అని పేర్లు పెట్టారు.