తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దసరా సెలవులతో పాటు.. స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు మోహిని అవతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.