ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన అపాయింట్ మెంట్ ఆర్డర్ లో నిబంధనలు చూసి ఉద్యోగులు ఖంగుతిన్నారు. రెండు సంవత్సరాలు ప్రొబెషనరీ పిరియడ్ ఉంటుందని నిబంధనల్లో చేర్చారు. అదే విధంగా మూడేళ్లు తప్పని సరిగా పని చేయాలని, మధ్యలో ఉద్యోగం మానేస్తే ఉద్యోగికి చెల్లించిన గౌరవ వేతనంతో పాటు, ప్రభుత్వం అతని పై ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని అందులో పేర్కొన్నారు. దీంతో చాలా మంది అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన చాలా మందికి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో వారు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రొబేషనరీ పిరియడ్ పని చేయాలని పేర్కొంది కానీ మూడేళ్లు ఖచ్చితంగా చేయాలని పేర్కొనలేదని ఎంపికైన అభ్యర్దులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఉద్యోగంలో చేరాలా లేదా అనే డైలమాలో వారు ఉన్నారు. సాధారణంగా ఉద్యోగి రాజీనామా చేస్తే ఇచ్చిన వేతనం తిరిగి చెల్లించడం, ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు పని చేయాలనే నిబంధన ఉండదు. ఏపీ సర్కార్ విధించిన నయా రూల్స్ పై సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది అభ్యర్దులు అసలు ఉద్యోగంలో చేరాలా వద్దా అని ఆలోచిస్తుంటే కొందరు అసలు ఉద్యోగంలో చేరకుడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరీ ప్రభుత్వం దీని పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.