ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభ్యర్థుల తుది జాబితా త్వరలో ప్రకటిస్తాం: పృథ్విరాజ్‌ చవాన్‌

national |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 12:04 PM

మహారాష్ట శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ – ఎన్‌సిపి కూటమితో కలిసి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) పోటీ చేయనున్నది. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రంలో మూడు నియోజక వర్గాలనుంచి పోటీ చేస్తుందని ఎన్‌సిపి నేత నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. ఔరంగాబాద్‌ ఈస్ట్‌, శివాజీ నగర్‌, భివాండీ ఈస్ట్‌ నియోజక వర్గాలనుంచి ఎస్‌పి పోటీ చేస్తుందని మాలిక్‌ అన్నారు. స్థానిక పార్టీలు కూడా తమ కూటమితో కలిసి పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని, వారికి సీట్లు కేటాయించే అంశంపై చర్చిస్తున్నామని ఆయన అన్నారు. అభ్యర్థుల తుది జాబితా త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పృథ్విరాజ్‌ చవాన్‌ చెప్పారు. మిత్ర పక్షాలతో సీట్ల పంపకంలో కొన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై తాము చర్చిస్తున్నామని, త్వరలో తుది నిర్ణయం వెలువరిస్తామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com