భోపాల్ : చూపుడు వేలును కొరికి మింగేసిన ఘటన మధ్యప్రదేశ్ చాంబల్ డివిజన్లోని ఓ గిరిజన ప్రాంతంలో చోటు చేసుకుంది. శ్యామ్ మహార్(45) తన కుమారుడితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. ఆస్గర్ ఖాన్(24) అనే యువకుడు కూడా స్కూటర్పై వెళ్తూ శ్యామ్ బైక్ను ఢీకొట్టాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అసభ్యకరంగా మాట్లాడడంతో ఆస్గర్ను శ్యామ్ హెచ్చరించారు. దీంతో ఖాన్.. శ్యామ్ ఎడమ చేతి చూపుడు వేలును కొరికాడు. అంతటితో ఆగకుండా ఆ వేలిని మింగేశాడు. దీంతో ఆస్గర్పై శ్యామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.