నెల్లూరులో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నాయకులు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు ఈ రోజు ప్రపంచమంతా జరుగుతున్నాయి.శాంతికాముకులైన గాంధీ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారు.అహింసే ఆయుధంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు.ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలు గాంధీ చూపిన బాటలో నడిచే విషయమై ఆలోచించుకోవాలి.ఓట్ల కోసం డైలాగులు, అధికారం కోసం నాలుగు మాటలు చెప్పడం కాదు.పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల పరిధిలో ఏం జరుగుతుందో అధికార పార్టీ నేతలు గుండెలపై చేయివేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి.రాష్ట్రంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న వైనంపై ఎమ్మెల్యేల నుంచి సీఎం వరకు ఆలోచించుకోవాలి..